క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూన్ 23: విద్యుదాఘాతానికి గురై యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పట్టణంలోని పెద్ద మసీదు ప్రాంతంలో నివాసం ఉండే మహ్మద్ ఆశ్రఫ్ అలీ(27) మేడ్చల్ రైల్వేకాలనీ వద్ద రైల్వేట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో మూత్ర విసర్జన చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. సృహకోల్పోయిన ఆశ్రఫ్‌ను హుటహుటిన మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను అదేరోజు అర్ధరాత్రి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.