క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 7 July 2019
ఎర్రగుంట్ల: కడప జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఎర్రగుంట్ల మండలం కోడూరు గ్రామ సమీపంలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మ(60), అంజనమ్మ(55), లక్ష్మీదేవి(60) అక్కడికక్కడే మృతి చెందారు. వెంకట సుబ్బయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా కడప చలమారెడ్డి పల్లెకు చెందిన వారు. కోడూరులోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి ఆటోలో వెళ్తూ మృత్యువాతపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.