క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప వద్ద విజయవాడ - భద్రాచలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగంగా వచ్చిన లారీ ఓ కారును ఢీకొనటంతో ఆదివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. కొత్తగూడెం పట్టణ పరిధిలోని బర్లిఫీట్ ప్రాంతానికి చెందిన పర్లపత్రి రమేష్(40), ప్రశాంతి(34) దంపతులతో పాటు పర్లపత్రి సుజాత(38) మృతి చెందారు. మరో ఇద్దరు సురేష్, నిఖిత తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందిన వారు. విజయవాడలో చదువుకుంటున్న సురేష్, సుజాత దంపతుల కుమార్తెను చూసేందుకు కుటుంబ సభ్యులు అందరూ కలిసి కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో కొత్తగూడెం వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది.