క్రైమ్/లీగల్

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), జూలై 14: ఇక్కడి పెందుర్తి పరిధిలో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది. స్థానిక ప్రహ్లాదపురం, భరత్‌నగర్‌కాలనీలో నివాసముంటున్న బి.సత్యనారాయణ శనివారం రాత్రి పైడిభీమవరంలోని ఫార్మకాంపెనీలో విధులకు హాజరై మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో భార్య బి.అనిత (42), కుమార్తె రమ్యశ్రీ (9), కుమారుడు ఉమామహేష్ (6) కనిపించకపోవడంతో వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతుండగా సమీపంలోని నూకాలమ్మ ఆలయం పక్కన విగతజీవులుగా పడి ఉండడాన్ని భర్త గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పిల్లలు పుట్టుకతో మూగ, చెవుడు కావడంతో పాటు ఆర్థిక ఇబ్బందులుండడంతో మనస్తాపానికి గురైన భార్య, పిల్లలకు పురుగుల మందు ఇచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పెందుర్తి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రం...ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీబిడ్డలు