క్రైమ్/లీగల్

తండ్రిపై గొడ్డలితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాలఘణపురం, జూలై 14: భూ తగాదా విషయంలో తండ్రిపై కుమారుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లింగాలఘణపురం గ్రామానికి చెందిన ఎడ్ల బసవయ్యకు నాలుగు ఎకరాల పట్టా భూమి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన ఒక ఎకరం భూమి గతంలో అమ్ముకున్నాడు. మిగిలిన 3 ఎకరాల భూమి నుంచి 2 ఎకరాల భూమి తన కుమారుడైన ఎడ్ల చంద్రయ్యకు పట్టాచేశారు. మరొక ఎకరాన్ని తన పేరుమీదనే ఉంచుకున్నాడు. బసవయ్యకు అప్పులు ఉండడంతో ఆ భూమిని అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కొడుకు చంద్రయ్య తరచూ దానికి అడ్డుపడుతున్నాడు.
దీనపై పెద్దమనుషుల వద్దకు వెళ్లగా బసవయ్యకు ఉన్న అప్పులు చెల్లించాలని కుమారుడికి చెప్పినట్టు సమాచారం. బసవయ్య భార్య లక్ష్మికి పక్షవాతం రావడం, మరోవైపు అప్పులు ఉండడంతో ఇబ్బందులు పడుతున్న బసవయ్య భూమి అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. దీనికి ఆగ్రహించిన కొడుకు తండ్రిపై గొడ్డలితో దాడి చేశాడు.
బసవయ్య తలకు గట్టిగా తగలడంతో రక్తస్రావమైన బసవయ్యను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోషం రవీందర్ తెలిపారు.