క్రైమ్/లీగల్

శివలింగానికి రక్త్భాషేకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి: పురాతన శివాలయంలో ఉన్న గుప్తనిధులపై కనే్నసిన దుండగులు ఏకంగా ముగ్గురిని చంపి వారి రక్తంతో శివలింగానికి రక్త్భాషేకం చేశారు. హత్యకు గురైన ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ దారుణం అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోర్తికోటలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఆలయం వద్దే ఆరుబయట నిద్రిస్తున్న శివరామిరెడ్డి(68), ఆయన సోదరి సత్యలక్ష్మి(70), మరో భక్తురాలు కమలమ్మ(75) గొంతుకోసి హత్య చేశారు. జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్రాంత అధ్యాపకుడు శివరామిరెడ్డి కోర్తికోట గ్రామంలోని శివాలయం వద్ద ఉంటూ పూజలు చేసుకుంటున్నాడు. అతనికి తోడుగా సోదరి కమలమ్మ కూడా ఉంటోంది. ఇటీవల శివరామిరెడ్డి ఆలయ పునరుద్దరణకు శ్రీకారం చుట్టాడు. గ్రామానికి చెందిన సత్యలక్ష్మి తరచూ ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చేవారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శివరామిరెడ్డి, కమలమ్మ, సత్యలక్ష్మి ఆలయ ప్రాంగణంలో మంచాలపై నిద్రించారు. అర్ధరాత్రి అక్కడికి చేరుకున్న దుండగులు నిద్రిస్తున్న ముగ్గురి గొంతులు కోసి ఆ రక్తంతో గుడిలోని శివలింగానికి అభిషేకం చేశారు. అనంతరం సమీపంలోని పుట్టలపై రక్తం చిలకరించారు. గుప్తనిధుల కోసమే ఈ ముగ్గురిని హత్య చేసి క్షుద్రపూజలు చేశారా అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలియగానే కదిరి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు సిబ్బందితో సోమవారం సంఘటనాస్థలాన్ని సందర్శించారు. పోలీసు జాగిలాలను రంగంలోకి దింపారు. ఈ దారుణ సంఘటన జిల్లాలో కలకలం రేపింది.
చిత్రాలు..శివలింగానికి రక్త్భాషేకం చేసిన దృశ్యం.* మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు