క్రైమ్/లీగల్

వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 16: బీహెచ్‌ఈఎల్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీకలదాకా తాగి మిత్రులే హత్య చేయడం గమనార్హం. ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చందానగర్ ఇన్‌స్పెపెక్టర్ బీ.రవీందర్ కథనం ప్రకారం హత్యోదంతం వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ ఎంఐజీ 235లో తల్లిదండ్రులతో కలిసి అద్దెకు ఉంటున్న రాజశేఖర రెడ్డి(43) ఎంఐజీ 1879 యజమాని రాంజీ ఇంట్లో సోమవారం రాత్రి భెల్ ఎంఐజీకి చెందిన సిద్ధూతో పాటు చందానగర్‌లోని గంగారామ్‌కు చెందిన షరీఫ్‌తో కలిసి మద్యం తాగారు. మంగళవారం ఉదయం లేచి మరోసారి తాగి మళ్లీ పడుకుని సాయంత్రం లేచి చూసేసరికి రాజశేఖర రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పదునైన ఆయుధంతో మెడ, తలపై బలంగా పొడవడంతో అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు.