క్రైమ్/లీగల్

ఇద్దరు ఘరానా దొంగలు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: హైదరాబాద్‌లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను వెస్ట్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. నిందితులు నుంచి 246 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతన నేరస్తులైన పహాడీషరీఫ్ షాహిన్‌నగర్‌కు చెందిన సయ్యద్ మాజిద్ (40), మహ్మద్ మోసిన్ (32)లు హైదరాబాద్, సైబరాబాద్‌లో గతంలో 40 దొంగతనాలకు పాల్పడ్డారు. పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లారు. తాళం వేసి ఉన్న ఇళ్లను పగలగోట్టి, రెక్కీ నిర్వహించి, రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నారు. టప్పాచపుత్రలో ఓ ఇంట్లో దొంగతనం చేసి నగలు, నగదు దోచుకున్నారు. సీసీ ఫూటేజ్‌ల ఆధారంగా నిందితులను పట్టుకోవడం జరిగిందని సీపీ తెలిపారు. సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ పీ.రాధకృష్ణ, ఇన్‌స్పెక్టర్ బీ.గట్టు మల్లు పాల్గొన్నారు.