క్రైమ్/లీగల్

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోనెగండ్ల, జూలై 16: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడులో మంగళవారం జరిగింది. జయలింగ(34), నవీన్(15) మోటార్‌బైక్‌పై నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ముందురోజు గాలివానకు విద్యుత్ తీగలు కిందికి వాలాయి. ఉదయం నీళ్లకోసం వీరిద్దరు మోటార్‌బైక్‌పై పొలం వద్దకు వెళ్తుండగా దగ్గరికి రాగానే గమనించిన జయలింగ బైక్‌ను నిలిపేప్రయత్నం చేశాడు. అప్పటికే దగ్గరకు రావడంతో తీగలు తగిలి జయలింగ ముఖం కాలిపోయి మృతిచెందాడు. వెనుక కూర్చున్న నవీన్ సైతం షాక్ తగిలి మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.