క్రైమ్/లీగల్

ఆటో- కారు ఢీ.. తల్లీ కొడుకు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, జూలై 18: ఆటో-కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో తల్లీ కొడుకులు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం యాచారం మండలం చౌదర్‌పల్లి గేటు సమీపంలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి యాచారం సీఐ మధుకుమార్ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చందనపేట మండలం కాట్రోత్ తండాకు చెందిన కాట్రోత్ నేజీ (45) కుమారుడు కాట్రోత్ మోహన్ (21), ఆటోలో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా, యాచారం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో ఆటో నుజ్జునుజ్జయిపోగా అందులో ప్రయాణిస్తున్న తల్లీకొడుకులు కాట్రోతు నేజీ, మోహన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆటోలోనే ప్రయాణిస్తున్న మోహన్ తండ్రికి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.