క్రైమ్/లీగల్

చితకబాదిన ఉపాధ్యాయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిరేకల్, జూలై 19: ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన నల్గొండ జిల్లా నకిరేకల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేశారు. నకిరేకల్‌లోని శ్రీకృష్ణవేణి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కమర్ కుమారుడు కుమేజ్‌ను తరగతి గణిత ఉపాధ్యాయుడు అప్పారావు రూలకర్రతో కొట్టడంతో తలపై స్వల్పగాయాలయ్యాయి. ఇదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మార్కెట్‌రోడ్డుకు చెందిన లక్ష్మీచరణ్‌తేజను కూడా ఈనెల 16న హిందీ టీచర్ రేష్మ కొట్టడంతో కుడిచేతిపై వాతలుపడ్డాయి. వరుసగా ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులను ఉపాధ్యాయులు కొట్టి గాయపర్చడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ విశ్వనాథ్ తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.