క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 20: విద్యుత్ షాక్ తగిలి టైల్స్ కార్మికుడు మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల గ్రామంలో నివాసముండే మేడి నర్సింహులు (19) టైల్స్ పని చేస్తుంటాడు. కొంపల్లి జయభేరి పార్కు కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో నర్సింహులు టైల్స్ పని చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు నీటిలో విద్యుత్ తీగలు పడి షాక్ తగిలింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నర్సింహులు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.