క్రైమ్/లీగల్

రవాణా శాఖ తనిఖీల్లో 44 బస్సులపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు ఆధ్వర్యంలో పలు బృందాలుగా ఏర్పడిన అధికారులు ఆదివారం అర్ధరాత్రి వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు, బెంగళూరు వైపు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించారు. ఆదివారం రాత్రి 10.00 గంటల నుంచి సోమవారం ఉదయం 8.00 గంటల వరకు అధికారులు దాదాపు 200 బస్సులను తనిఖీ చేశారు. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 44 బస్సులపై రవాణా శాఖాధికారులు కేసులు నమోదు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలతో రవాణా శాఖకు రూ. 22 లక్షల ఆదాయం రావడం విశేషం. ఈ తనిఖీలకు సంబంధించి వివరాలను పాపారావు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై జరిమానాలు విధించి వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ అధిక ఆదాయాన్ని నిచ్చే వనరుగా నిలిచిందన్నారు. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పాపారావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు. ఈ దాడులను ఇకపై ముమ్మరంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.