క్రైమ్/లీగల్

నలుగురు అనుమానితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 20: కాచవానిసింగారంలోని మహేశ్వరినగర్‌లో మేడిపల్లి పోలీసులు మంగళవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోకి ప్రవేశించిన పోలీసులు ఎవరిని బయటకు వెళ్ల్లనీయకుండా ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు. ఏమి చేస్తారు. పూర్తి వివరాలను సేకరించారు. ఎల్‌బీనగర్ డీసీపీ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ఏసీపీలు సందీప్, శివకుమార్, ఇన్‌స్పెక్టర్లు అంజిరెడ్డి, వెంకటేశ్వర్లు, రఘువీరా రెడ్డి, శ్రీనివాస్, రవిబాబు, కిరణ్, 200 మంది పోలీసులతో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో ఎలాంటి డాక్యుమెంట్లు లేని 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని నిషేధ గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కారులోని డబ్బు చోరీ
తాండూరు, ఆగస్టు 20: బ్యాంక్ వద్ద పార్కింగ్ చేసిన కారులో నుంచి డబ్బు చోరీ చేసిన సంఘటన వెలుగుచూసింది. పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద స్థానికుడు సాయిపూర్ నర్సింహులు కారు నిలిపాడు. పని నిమిత్తం వెళ్లి వచ్చేసరికి కారులోని రూ.50 వేలు కనిపించలేదు. పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.