క్రైమ్/లీగల్
మనీ లాండరింగ్ కేసులో రాజ్థాకరే ఉక్కిరిబిక్కిరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 August 2019
ముంబయి, ఆగస్టు 22: ఓ మనీలాండలింగ్ కేసులో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్థాకరేను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. విచారణ నిమిత్తం దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయానికి రాజ్థాకరే తన కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు.
ఉదయం 11.30కు మొదలైన విచారణ రాత్రి 8.15 గంటల వరకు సాగింది. ఈ కేసుకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని బయటకు లాగే రీతిలో ఈడీ అధికారులు ఓ సుదీర్ఘ ప్రశ్నావళినే రూపొందించారు. రాజ్థాకరే ప్రకటనను రికార్డు చేసిన తరువాత రాత్రి పొద్దుపోయాక ఆయన్ను వదిలేశామని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసులో ఆయన్ను మళ్లీ పిలుస్తారా? లేదా? అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు.
చిత్రం...విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి హాజరైన రాజ్థాకరే