క్రైమ్/లీగల్

16 మంది సీనియర్ సివిల్ జడ్జిలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 6: రాష్ట్రంలోని 16 మంది సీనియర్ సివిల్ జడ్జిలను జిల్లా జడ్జీలు (ఎంట్రీ లెవెల్)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.మోజెస్, ఆళ్లగడ్డ సీనియర్ సివిల్ జడ్జి వి.నరేష్, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి అమ్మన రాజా, కాకినాడ 3వ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.మాధురి, ప్రకాశం జిల్లా ఒంగోలు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఆర్.శరత్ బాబు, అదే జిల్లా పర్చూరు సీనియర్ సివిల్ జడ్జి షేక్ మహమ్మద్ ఫజుల్లా, అనంతపురం జిల్లా కదిరి సీనియర్ సివిల్ జడ్జి ఎస్.రమణయ్య, విశాఖ జిల్లా అనకాపల్లి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి పి.వాసు, విజయనగరం జిల్లా విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జి కె.రాంబాబు, గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డి.లక్ష్మి, చిత్తూరు జిల్లా తిరుపతి ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి డి.ఏడుకొండలు, చిత్తూరు ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి పీవీఎస్ సత్యనారాయణ మూర్తి, నెల్లూరు జిల్లా గూడూరు సీనియర్ సివిల్ జడ్జి కె.సీతారామ కృష్ణారావు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీనియర్ సివిల్ జడ్జి వీఎస్‌ఎస్ శ్రీనివాస శర్మ, కడప జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సీఎస్ మూర్తి, కృష్ణా జిల్లా విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి.్భపాల్ రెడ్డికి పదోన్నతి కల్పించింది. వీరికి పోస్టింగ్‌లను ఇవ్వాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు.