క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, అక్టోబర్ 5: అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. పెనుకొండ పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నరేష్‌కుమార్(39), నరేంద్రబాబు(38) అక్కడికక్కడే మృతి చెందారు. రోహిత్‌శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్లను ఢీకొని అవతలి వైపు వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. బెంగళూరు కియా పార్ట్స్ కంపెనీలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్న వీరు వారాంతపు సెలవులో హైదరాబాద్ వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.