క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, అక్టోబర్ 14: విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం వేకువజామున శ్రీకాకుళం జిల్లా సోంపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు సోంపేట చాకలివీధికి చెందిన కె.సోమేశ్వరరావు(32), పల్లివీధికి చెందిన లోకేష్ (36) విద్యుదాఘాతంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆదివారం రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి వస్తూ సోంపేటలో తమ బంధువుల ఇళ్లలో జరిగిన గౌరీపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ద్విచక్రవాహనంపై తమ ఇళ్లకు వెళ్తుండగా, రహదారిపై తెగి పడి వున్న 11కేవీ విద్యుత్తు తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సోంపేటలో వెల్డింగ్‌షాపును నిర్వహిస్తూ లోకేష్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమేశ్వరరావు చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ తల్లిదండ్రులతోపాటు ఉంటున్నాడు. సోంపేట సామాజిక ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అందరితో సన్నిహితంగా ఉండే ఇద్దరూ ఇలా చనిపోవడంతో బంధువులు, సన్నిహితులు సోంపేట సామాజిక ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో వచ్చారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ ఆశోక్, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ ఆసుపత్రి వద్దకు వచ్చి మృతుల కుటుంబీకులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఇద్దరు నేతలు భరోసా ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.