క్రైమ్/లీగల్

రైలు పట్టాలపై 4 మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం: ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో అనంతపురం జిల్లా హిందూపురం రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం- అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కొట్నూరు రైల్వేగేట్ వద్ద ఓబులేసు (60), దేవరపల్లి వద్ద గొల్ల ఆదినారాయణ (40), కొడిపి రైల్వేగేట్ వద్ద భార్యాభర్తలు నాగభూషణ్‌రావు, గీతాబాయి మృతదేహాలు మంగళవారం రైలుపట్టాలపై కనిపించాయి. కిలోమీటరు పరిధిలో ఈ నాలుగు మృతదేహాలు కనిపించడంతో అటు పోలీసులు, ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా చంపి పట్టాలపై పడేశారా అన్న అనుమానాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.