క్రైమ్/లీగల్

స్నేహితుడి హత్యకేసులో జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, ఏప్రిల్ 16: నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన పుట్ట విష్ణువర్థన్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన తన ప్రాణ స్నేహితుడు నల్లగొండ మున్సిపాల్టీ మాజీ కౌన్సిలర్ గుత్తా రాజేందర్‌రెడ్డిని హత్య చేసినట్లు నేరం రుజువైనందున విష్ణువర్థన్‌రెడ్డికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ మొదటి అదనపు జిల్లా జడ్జి సీపీ.విందేశ్వరి సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి. 2014, జూన్ 22న రాజేందర్‌రెడ్డి తన సొంత గ్రామం బ్రాహ్మణవెల్లంలలో ఉండగా ముందస్తు పథకంతో విష్ణువర్థన్‌రెడ్డి ఫోన్ చేసి ఇంటికి పిలిపించిన అనంతరం ఇద్దరూ మద్యం సేవించారు. రాజేందర్‌రెడ్డిని హతమార్చాలనే ఉద్దేశంతో ఆయన కళ్లపై విష్ణువర్థన్‌రెడ్డి కారం చల్లి కత్తిపీటతో తలపై మోది హత్య చేసినట్లు రాజేందర్‌రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నార్కట్‌పల్లి ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్, నకిరేకల్ సీఐలు ఎస్.రాఘవరావు, పి.ప్రవీణ్‌కుమార్‌లు కేసు విచారణ చేసి అంతిమ నివేదిక సమర్పించారు. వాద ప్రతివాదనలు విన్న పిదప న్యాయమూర్తి తీర్పునిస్తూ హత్య చేసినట్లు నేరం రుజువైనందున విష్ణువర్థన్‌రెడ్డికి జీవిత ఖైదుతో పాటు 10వేల జరిమానా విధించారు.