క్రైమ్/లీగల్

రెండు బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, ఏప్రిల్ 16: ఎదురు ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ కొనగా ఒకరు మృతి చెందిన సంఘటన పటన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. స్థానిక పోలీసులు అందించిన ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ పంచాయతి పరిధిలోని వడ్డెర కాలనీకి చెందిన మారల పెద్ద మారయ్య(55) స్టోన్ కటర్‌గా పని చేస్తున్నాడు. అదే వడ్డెర బస్తీకి చెందిన యాదయ్యతో కలిసి బైక్ నంబరు టిఎస్ 07 ఎఫ్‌సి 127 గల దానిపై వెలుతుండగా ప్రమాదం జరిగింది. ఇస్నాపూర్ కూడలి నుండి సంగారెడ్డి వైపు వీరిద్దరు కలిసి రాంగ్ రూట్‌లో వెలుతుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. హుమ్నాబాద్ జిల్లా కర్నాటక రాష్ట్రానికి చెందిన మహమ్మద్ రసీమ్, ఫారూఖ్‌లు కలిసి సంగారెడ్డి నుండి హైద్రాబాద్ వైపు టిఎస్ 07 ఇజెడ్ 8707 నంబరు గల బైక్‌పై వెలుతున్నారు. ఇస్నాపూర్ గ్రామ శివారులోని జైమాత గ్యారేజ్ వద్ద రెండు బైక్‌లు వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మారయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్ రసీమ్ ఫిర్యాదు మేరకు పటన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్‌ఐ కిష్టారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.