క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హయత్నగర్, శామీర్పేట, అక్టోబర్ 22 : మరో 20రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి భాజా మోగాల్సి ఉంది. దైవ దర్శనం కోసం మంగళవారం ఉదయం తండ్రి, కుమారుడు ద్విచక్ర వాహనంపై కొమరవెళ్లికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. చంపాపేట్ డివిజన్ రెడ్డి బస్తిలో ప్రేమ్దాస్(60), కుమారుడు ముఖేష్(30) నివాసం ఉంటున్నారు. ప్రేమ్దాస్ స్థానికంగా చిన్న వ్యాపారం చేస్తుండగా ముఖేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ప్రేమ్దాస్ భార్య నాలుగు సంవత్సరాల క్రితం మృతిచెందగా ఒక్క కూతురికి వివాహం జరిపించాడు. ముఖేష్కు నవంబర్ 10న వివాహం జరగాల్సి ఉండగా కొమరవెల్లి దర్శనం కోసం వెళ్తుండగా తుర్కపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తండ్రి, కొడుకు మృతి చెందడంతో కుటుంబంతో పాటు ఆ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.