క్రైమ్/లీగల్

డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యార్థి పూజిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్గి, ఏప్రిల్ 17: కారంపూడిలోని కార్తికేయ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని పూజిత (5)అదే స్కూల్‌కు చెందిన బస్ కిందపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడిగొప్పలకు చెందిన సంక్రాంతి ఆదినారాయణ కుమార్తె ఎల్‌కెజీలో కారంపూడిలోని కార్తికేయ పాఠశాలలో చేర్చారు. అడిగొప్పల నుండి కారంపూడికి విద్యార్థులను చేరవేసే బస్సు మంగళవారం తిరిగి విద్యార్థులను అడిగొప్పల ఇంటికి చేర్చేందుకు వచ్చింది. అయితే విద్యార్థులు బస్సు నుండి దిగుతున్న సమయంలో బస్సు ముందు నడుచుకుంటూ గమ్యానికి చేరుతున్న విద్యార్థినిని గమనించని బస్ డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి, ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ముందు ఉన్న చిన్నారి పూజిత టైర్లకిందపడి మృతి చెందింది. ఈ విషయమై స్థానికులు గమనించి, ఆగ్రహానికి లోనై డ్రైవర్‌పై దాడి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు.