క్రైమ్/లీగల్
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 November 2019
ఇబ్రహీంపట్నం, నవంబర్ 10: జాతీయ రహదారి గాజులపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఇబ్రహీంపట్నం పోలీసుల కథనం ప్రకారం ద్విచక్ర వాహనం మీద ప్రసాద్ అతని మేనల్లుడు హితేష్తో కలిసి ఇబ్రహీంపట్నం వస్తుండగా పశ్చిమ ఇబ్రహీంపట్నం గాజులపేట వద్ద తెలంగాణాకు చెందిన ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో హితేష్ (5) రోడ్డు మీద పడి తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం గొల్లపూడి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శవపరీక్షకై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.