క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, నవంబర్ 10: సెలవు దినం కావడంలో మిత్రులంతా దైవ దర్శనంతో పాటు ఆహ్లాదంగా, ఉత్సాహంగా గడిపేందుకు శ్రీశైలం వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి సమీపంలో అదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పటాన్‌చెరువు పరిధిలోని రాంచంద్రాపురం (అర్‌సిపురం)కు చెందిన అరుగురు యువకులు శనివారం శ్రీశైలం వెళ్లి అదివారం తిరిగి వస్తుండగా శ్రీశైలం జాతీయ రహదారిపై గల వెల్దండ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో గల ఏవీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఏపీ 28 డిఅర్ 2513 కారు, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న నూతన ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న కుర్వ గణేష్(25), కేవ నాగరాజు (26) అక్కడికక్కడే మృతి చెందారు. వారివురు మృతదేహలు గుర్తు పట్టరాని స్థితిలో ఉన్నాయి. కారులో ఉన్న వారితో పాటు వెనుక వస్తున్న వారి స్నేహితులు సురక్షితంగా ఉన్నారు. మృతులు ఇరువురు కారు డ్రెవర్లని తెలియవచ్చింది. మృతదేహలను స్థానిక సీఐ నాగరాజు, ఎస్సైలు నర్సింహులు, బాలకృష్ణలు కల్వకుర్తి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరుపుతున్నట్ట్లు పోలీసులు తెలిపారు.
*చిత్రాలు.. మృతి చెందిన గణేష్, నాగరాజు