క్రైమ్/లీగల్

మిస్టరీగా మారిన అర్చకుడి మిస్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 16: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఓ పురోహితుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. స్థానిక ఖొజ్జిల్లిపేటకు చెందిన పోపూరి రాజబాబు అర్చకత్వం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5వతేదీన ఇంటి నుండి బయటకు వెళ్లిన రాజబాబు తిరిగి రాలేదు. దీంతో 6వతేదీన రాజబాబు భార్య కామేశ్వరి ఆర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజులు గడుస్తున్నా తన భర్త ఆచూకీ తెలియడం లేదని, పోలీసులను అడిగితే విచారిస్తున్నామని చెబుతున్నారే గానీ భరోసా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రాజబాబు భార్య ఈ నెల 11వతేదీన స్పందన కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రవీంద్రనాథ్ బాబుకు అర్జీ ఇచ్చారు. అయితే తన భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఒంటి మీద బంగారం, జేబులో డబ్బులు ఉన్నాయని బాధితురాలు తెలియజేస్తోంది. దీనిపై ఆర్‌పేట సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా అదృశ్యమైన రాజబాబు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.