క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 17: మండలంలోని గోధూర్ గ్రామానికి చెందిన సైదెపల్లి శేఖర్ (28) అనే యువ రైతు అప్పుల బాధతో సోమవారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం మృతుడు తనకున్న 2ఎకరాలతో పాటు మరో 3ఎకరాలు కౌలుకు తీసుకుని తన భార్య లహరితో వ్యవసాయం చేసుకుంటున్నాడని తన వ్యవసాయానికి తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి రావడంతో తీవ్ర మనస్థాపం చెంది తన వ్యవసాయ క్షేత్రంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య లహరి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు రెండేళ్ల కూతురు ఉన్నారు. తమ గ్రామానికి చెందిన యువ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అతని కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని సర్పంచ్ కాయితి లావణ్య కోరారు.