క్రైమ్/లీగల్

నిలిచి ఉన్న లారీని ఢీకొన్న వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, డిసెంబర్ 10: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో రోడ్డుపై లారీ నిలిచి ఉండటంతో అది గమనించకుండా వెనుక నుంచి టాటా ఏస్ వాహనం వచ్చి ఢీకొనడంతో నలుగురు వ్యక్తులతోపాటు ఒక చిన్నారి తీవ్రంగా గాయపడింది. మంగళవారం ఉదయం షాద్‌నగర్ పురపాలక సంఘం చటాన్‌పల్లి 44వ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనక నుంచి టాటాఎసీ వాహనం ఢీకొనడంతో టాటాఎసీ వాహనంలో ప్రయాణిస్తున్న శాంతి (25), విజయ (23), వౌనిక (24), డ్రైవర్ మాణిక్యం (42)తోపాటు రెండేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడగా వారిని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టాటా ఏస్ వాహనం ముందు గ్లాస్‌లో ఇరువురు ఇరుక్కుపోయిన వారిని అతి కష్టం మీద గ్లాస్ పగలగొట్టి బయటకు తీశారు. హైదరాబాద్ నుంచి కొత్తకొటకు వెళ్తున్న సమయంలోనే చటాన్‌పల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై లారీ నిలుపుకొని దిశ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సమయంలోనే వెనుక నుంచి ఈ సంఘటన చోటు చేసుకుంది.