క్రైమ్/లీగల్

లారీ ఢీకొని తల్ల్లీ కొడుకు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, డిసెంబర్ 14: లారీని, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మల రామారం మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొందెల ఉపేందర్ (19) తల్లి లక్ష్మీ (46), తండ్రి సత్తయ్యలతో కలిసి ద్విచక్ర వాహనంపై కీసర మీదుగా తిమ్మాపూర్ వెళుతున్నాడు. కీసరలోని టీపీఏం చర్చి దగ్గరకు రాగానే ముందుగా వెళుతున్న వారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఉపేందర్ అక్కడి కక్కడే మృతి చెందాడు. తల్లి లక్ష్మీకి తీవ్ర గాయాలు కాగా, తండ్రి సత్తయ్యకు చెయ్యి విరిగింది. చికిత్స నిమిత్తం నగరంలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి లక్ష్మీ మృతి చెందినట్లు సీఐ నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.