క్రైమ్/లీగల్
మినీ వ్యాన్ బోల్తా: 19మందికి గాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 15 December 2019
నాగలాపురం, డిసెంబర్ 14: చిత్తూరు జిల్లా పిచ్చాటూరు సమీపంలో కూలి పనులకు వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తాప డిన ఘటనలో 19మంది గాయపడ్డారు వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడు కాశిరెడ్డి పేటకు చెందిన సుమారు 28 మంది కూలీలు రోజూ లాగే శనివారం కూడా ఏర్పేడు మండల పరిధిలోని కూలి పనికి వస్తుండగా మినీ వ్యాన్లో బయల్దేరి వస్తుండగా పిచ్చాటూరు మండలం రెప్పాల పట్టెడ సమీపంలో ప్రమాదవశాత్తూ మినీ వ్యాన్ బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న ఉన్న 28 మందికి గాయాలయ్యాయి. ఇందులో 19 మందికి స్వల్పగాయాలు కాగా, మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పిచ్చాటూరు, సత్యవేడు, చిత్తూరు, తిరుపతి, చెన్నై ఆసుపత్రులకు తరలించారు.