క్రైమ్/లీగల్

కన్న కొడుకులను కడతేర్చిన కసాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల రూరల్, ఏప్రిల్ 21: నిద్రపోతున్న కన్న కొడుకులను ఓ కసాయి తండ్రి పాశవికంగా హతమార్చి పరారైన సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణ శివారులో శనివారం జరిగింది. మాచర్ల నియోజక వర్గంలోని వెల్దుర్తి మండల పరిధిలోని శిరిగిరిపాడుకు చెందిన కుర్రి బ్రహ్మారెడ్డి కొన్ని సంవత్సరాల కిందట మాచర్లకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బ్రహ్మారెడ్డికి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ఇడుమెల్ల గ్రామానికి చెందిన అనితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. వీరిలో శశాంక్‌రెడ్డి (10), అదీప్‌రెడ్డి (8) మానసిక వికలాంగులుకాగా గగన్‌రెడ్డి 9 నెలల చిన్నారి. అందరూ శుక్రవారం రాత్రి యథావిధిగా భోజనాలు ముగించుకుని నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున పిల్లలు ఇద్దరికీ మంచినీరు తాగించేందుకు అనిత పిల్లలను కదపగా వారు ఎంతకీ స్పృహలోకి రాకపోవటంతో ఆందోళనతో తన కుటుంబ సభ్యులను కేకలు వేస్తూ పిలిచింది. పిల్లలు ఇద్దరూ అప్పటికే మృతిచెందినట్టు గుర్తించారు. బ్రహ్మారెడ్డి ఇంట్లో లేకపోవటం, సెల్‌ఫోన్ సైతం ఇంట్లోనే పెట్టి వెళ్ళి పోవటంతో అతడిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ మాచర్ల రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి అర్బన్ సీఐ సింగిరేసు సాంబశివరావు, రూరల్ ఎస్‌ఐ లోకేశ్వరరావు చేరుకొని చిన్నారుల మృతదేహాలను పరిశీలించి మృతుల కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించారు. ఈ మేరకు రూరల్ ఎస్‌ఐ లోకేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల హత్య విషయం తెలుసుకున్న గురజాల డీఎస్పీ ఏవీకె ప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే చిన్నారులు ఏ విధంగా చనిపోయారనేది వెల్లడవుతుందన్నారు. బ్రహ్మారెడ్డి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. మానసిక వికలాంగులైనంత మాత్రాన కన్న కొడుకులను చంపుకోవటం ఏంటని అక్కడికి చేరుకున్న అనిత బంధువులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్రం..చిన్నారులు శశాంక్, ప్రదీప్‌రెడ్డి మృతదేహాలు