క్రైమ్/లీగల్

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22: గత సంవత్సరం డిసెంబర్‌లో జరిగిన మహిళ హత్య కేసును శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఛేదించారు. భర్తే హంతకుడుని నిర్ధారించి అరెస్టు చేశారు. డీఎస్పీ వెంకటకిషోర్ ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఓబుల్ రెడ్డికి, కేవీబీపురం మండలం మారప్పరెడ్డి కండ్రిగకు చెందిన మల్లీశ్వరికి 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. శ్రీకాహస్తిలో పూల వ్యాపారం చేసుకుని జీవిస్తున్న వీరు, సమీప గ్రామాల్లో లభించే పువ్వులను సేకరించడమే కాకుండా, పాలసముద్రం ఆకులను సేకరించేవారు. ఈక్రమంలో గతేడాది డిసెంబర్ 12న శ్రీకాళహస్తి మండలం వేడాం గ్రామానికి సమీపంలోని బైరవకోనలో పాలసముద్రం ఆకులను తీసుకురావడానికి భార్య, భర్తలు ఇద్దరూ వెళ్లారు. అయితే ఓబుల్ రెడ్డి మాత్రమే తిరిగిరాగా, తన భార్య కనిపించడంలేదంటూ అందరికీ చెప్పాడు. కొద్ది రోజుల తరువాత ఓబుల్ రెడ్డి సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఎటో వెళ్లిపోయాడు. సీఐ సుదర్శన ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టగా, ఓబుల్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పలు చోట్ల గాలించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన భార్య మల్లీశ్వరికి అక్రమ సంబంధం ఉండటం వల్లే బైరవకోనలో హత్య చేసినట్లు ఓబుల్ రెడ్డి పోలీసుల ముందు అంగీకరించినటు డీఎస్పీ చెప్పారు. ఓబుల్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు.