క్రైమ్/లీగల్

పెళ్లి చూపులకు వెళుతూ పరలోకానికి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయగిరి, ఏప్రిల్ 22 : నియోజకవర్గ పరిధిలోని నర్రవాడ- దుత్తలూరు 565 జాతీయ రహదారిపై ఆగి ఉన్న మినీలారీని ఢీకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన కంచుపాటి దావీదు (50), గనే్నపల్లికి చెందిన బక్కా శామ్యూల్ (35), మరోవ్యక్తి కలసి దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామానికి దావీదు కుమారుడి పెళ్లిచూపులకు మోటార్‌బైక్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో మరమ్మతులకు గురై జాతీయ రహదారిపై ఆగి ఉన్న మిని లారీని బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో దావీదు, శామ్యూల్ అక్కడిక్కడే మృతిచెందగా మరోవ్యక్తికి గాయాలయ్యాయి. ముందుగా ఆటోలో కొత్తపేట గ్రామానికి వెళ్లిన బంధువులకు సమాచారం చేరడంతో వారు అక్కడికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. దావీదుకు నలుగురు పిల్లలు, శామ్యూల్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.