క్రైమ్/లీగల్
తిరుమలలో చోరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 April 2018
తిరుపతి, ఏప్రిల్ 22: తిరుమలలో తాళాలు వేసిన గదులను కూడా దొంగలు వదలడంలేదు. తాము బస చేసిన గదికి తాళాలు వేసి తిరుమలేశుని దర్శనానికి వెళ్లి వచ్చేలోగానే గదిలోని విలువైన వస్తువులు, నగదు చోరీకి గురైన సంఘటన ఆదివారం తిరుమలలో చోటుచేసుకుంది. విజయనగరానికి చెందిన భక్తులు తిరుమలకు చేరుకుని ఓ గదిలో బస చేశారు. ఆదివారం తిరుమలేశుని దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి గదిలోని విలువైన వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.