క్రైమ్/లీగల్

చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 26: చోరీ కేసుల్లో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు వేలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పెజ్జోనిపేటకు చెందిన బెల్లంకొండ నాగేంద్రబాబు అలియాస్ బాబు(35) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రాజరాజేశ్వరీపేటకు చెందిన గొడా లింగమయ్య(23) టాపీ పని చేస్తుంటాడు. పెజ్జోనిపేటకు చెందిన యలమంచిలి రాజేష్(20) బార్బర్ పని చేస్తుంటాడు. ఈ ముగ్గురూ కలిసి నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ల వద్ద రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పిల్లర్లకు వినియోగించే ఇనుపురాడ్లు, రింగులు అపహరించగా వీరిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.