క్రైమ్/లీగల్

రెండు గ్రామాల్లో ఒకేసారి చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, ఏప్రిల్ 27: మండలంలో రెండు గ్రామాల్లో ఒకేసారి దొంగతనాలు జరిగాయి. ఇందుకు సంబంధించి ఏ ఎస్ ఐ అర్జునరావు అందించిన వివరాల ప్రకారం మండలం వెలగవలస, రంగప్పవలస గ్రామాల్లో గురువారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో రంగప్పవలస గ్రామానికి చెందిన వై వెంకటరావు ఇంట్లో ఉన్న తులంన్నర బంగారం, 2వేల రూపాయల నగదును చోరీ చేశారని, అలాగే వెలగవలస గ్రామాల్లో కూడా అదే రోజు రాత్రి దొంగతనాలు జరిగాయన్నారు. మేడపై పడుకున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన సెల్‌ఫోన్లును దొంగలించారన్నారు. ఈమేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నామన్నారు. అనంతరం ఏఎస్‌ఐ మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలంలో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగిన వెంటనే తమకు తెలియజేయాలన్నారు. ఆరుబయట పడుకునేవారు ఇళ్లకు తాళాలు వేసి పడుకోవాలన్నారు.