క్రైమ్/లీగల్

నకిలీ ఏసీబీ అధికారుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : కొందరు వ్యక్తులు ఫిషరీస్ ఎడికి ఇటీవల తాము ఏసీబీ అధికారులమని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిన నేపధ్యంలో ఎడి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు త్రీటౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి గ్రామానికి చెందిన చంచెలవాహి ఉమామహేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా మండపేట ద్వారపూడి గ్రామానికి చెందిన గుండాబత్తుల మణికంఠ, అదే గ్రామానికి చెందిన సత్తి సాయి సూర్యనారాయణ మూర్తి అలియాస్ సాయిరామ్, హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన చండ్ర రాంబాబు అలియాస్ ప్రసాద్‌లు ముఠాగా ఏర్పడి ఫిషరీస్ ఎడి సత్తి పద్మనాభమూర్తిని ఇటీవల ఫోన్ ద్వారా తాము ఎసిబి అధికారులమని, తగిన డబ్బు ఇవ్వకపోతే మీ ఫైల్‌ను రాజమండ్రి ఏసీబీ కోర్టుకు పంపిస్తామని బెదిరించారు. అయినప్పటికీ ఎడి ఎటువంటి భయాందోళనలు చెందకుండా త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. విలేఖరుల సమావేశంలో ఎస్సై పైడిబాబు తదితరులు వున్నారు.