క్రైమ్/లీగల్

పోతురాజుకుంటలో గుర్తు తెలియని మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఏప్రిల్ 30:పట్టణంలోని పగిడ్యాల రహదారిలో ఉన్న పోతురాజుకుంటలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ శవం కుంటలో గత 3 రోజులుగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ఎవరైనా హత్య చేసి కుంటలో పడేశారా అనే విషయాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి వుంది. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీయించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
బనగానపల్లె, ఏప్రిల్ 30: మండలంలోని ఎనకండ్ల గ్రామంలో సోమవారం ఉదయం వలిబాషా (9) అనే బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతి చెందిన చిన్నారి సమీపంలోనే నిర్మాణంలో ఉన్న ఇంటికి విద్యుత్ వైరింగ్ చేస్తున్నారు. ఇనుప చువ్వకు విద్యుత్ వైరు తగిలి ఉండడం, ఏమరపాటున పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. పరిసరాల్లో ఉన్న వారు బాలుడు సంబంధీకులు చికిత్సకై వెంటనే బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేలోపే చిన్నారి మృతి చెందాడు.