క్రైమ్/లీగల్

ఆటో - డీసీఎం ఢీకొని ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొనకనమిట్ల, ఏప్రిల్ 30: ఒంగోలు - కర్నూలు రహదారిపై సోమవారం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామసమీపంలో ఆటో - డిసిఎం లారి ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. బట్టల వ్యాపారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు ఒంగోలు నుంచి టాటాఎసి ఆటోను మాట్లాడుకుని నంద్యాలకు ఆదివారం రాత్రి బయలుదేరారు. మార్గమధ్యలోని గొట్లగట్టుకు సమీపంలో ఆటోను కడప నుంచి కరిబుజ్జపండ్లలోడుతో వస్తున్న డిసిఎం లారీ ఢీకొంది. ఈప్రమాదంలో ఆటోడ్రైవర్ నల్లపువెంకటేశ్వరరెడ్డి (27), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజిపుర్‌నగర్ జిల్లా చాంద్‌సీనా గ్రామానికి చెందిన షేక్ ఖాదీర్ (20), షేక్ ఖూర్‌ఖాన్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఈప్రమాదంలో ముబారిక్, నజీమ్‌లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పొదిలి వైద్యశాలకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. కాగా డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డి ఒంగోలులోని మారుతినగర్‌కు చెందిన వాడు. డిసిఎం డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వలననే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని దర్శి డివైఎస్పీ నాగేశ్వరరావు, పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్సై బాలకృష్ణలు పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు.