క్రైమ్/లీగల్

ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, మే 1: మండల పరిధిలోని సాయిబాబు సమీపంలో తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారిపై మంగళవారం ఆటోబోల్తా కొట్టిన సంఘటనలో రాగం మురళి (25) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కథనం ప్రకారం.. తల్లాడ మండలం అన్నారుగూడెంకు చెందిన అనుమోలు సర్వేశ్వరరావు అదే గ్రామానికి చెందిన రాగం మురళితో కలిసి జూలూరుపాడు ప్రాంతానికి ఆటోలో వ్యాపారం చేస్తుంటారు. ఈ నేపధ్యంలో పెట్టుబడి వసూళ్లకు ఆటోలో వస్తుండగా మార్గంమధ్యంలో జూలూరుపాడు వద్దకు చేరుకునే సరికి పెద్ద ఎత్తున గాలి దుమారం రావటంతో సుడిగాలికి ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న మురళి తీవ్రగాయాలపాలై మృతి చెందగా, గాయపడిన సర్వేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు సందర్శించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.