క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 2 May 2018
పొదలకూరు, మే 1 : మండలంలోని రామాపురం సమీపంలో దుగ్గుంట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాపురం గ్రామానికి చెందిన వి సుబ్రహ్మణ్యం (35) అనే గిరిజనుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న సుబ్రహ్మణ్యంను నెల్లూరు నుంచి రాపూరుకు వెళ్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన ఇతన్ని నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. కండలేరు డ్యాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.