క్రైమ్/లీగల్

భర్తను హత్య చేసిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమందేపల్లి, మే 20: అక్రమ సంబంధంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసును పెనుకొండ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్సై ప్రసాద్ చేధించారు. ఆదివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ కరీముల్లాషరీఫ్ మాట్లాడుతూ, ఈ నెల 1వతేదీ మండల పరిధిలోని రేణుకానగర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. అయితే హత్యకు గురయింది కొత్తపల్లికి చెందిన వడ్డేరాముగా గుర్తించారు. హతుడి భార్య లక్ష్మిదేవికి అశోక్‌తో అక్రమ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ లక్ష్మిదేవి, ప్రియుడు అశోక్, బంధువులు శిల్ప, నరసింహప్పతో కలిసి రాము ముఖంపై యాసిడ్ పోసి అనంతరం ఆటోలో రేణుకానగర్ వద్దకు తీసుకెళ్ళి ముళ్ళపొదల్లో ఎదపై కొట్టి టవాల్‌తో ఉరి వేసి హత్య చేసిన తర్వాత పెట్రోలు పోసి నిప్పంటించినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులను చాకర్లపల్లి బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. నిందితులను కోర్టులో హాజరు పరచినట్లు తెలిపారు.
విద్యుత్ లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలు
అమరాపురం, మే 20: మండలకేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తున్న లైన్‌మెన్ సత్యనారాయణ పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందకు పడటంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు చేయించి మెరుగైన చికిత్సల కోసం ఇతర ప్రాంతానికి తరలించారు.

వివాహిత ఆత్మహత్య
అమరాపురం, మే 20: మండల పరిధిలోని దేవగానిపల్లికి చెందిన లక్ష్మిదేవి (50) అనే వివాహిత ఆదివారం కడుపునొప్పి తాళలేక గ్రామ సమీపంలోని ఓ ఫారంపాండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై దిలీప్‌కుమార్ తెలిపారు. గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధ పడుతున్న ఆమెకు కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు చెప్పారు.
మహిళ ఆత్మహత్య
పెద్దవడుగూరు, మే 20: మండలంలోని విరుపాపురం గ్రామానికి చెందిన పల్లికొండమ్మ (35) అనే వివాహిత శనివారం రాత్రి పొద్దుపోయాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ వీటికి తోడు కుటుంబ సమస్యలు అధికం కావడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్తలాలెప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు.