క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదానికి కుటుంబం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 20: గుంటూరు జిల్లా మంగళగిరి - విజయవాడ రోడ్డు మార్గంలో నులకపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు కొమ్మతోటి శ్రీకాంత్(29), సరిత(25), వారి కుమార్తె అక్షర(3) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు కోకాకోలా కంపెనీలో పనిచేస్తున్న శ్రీకాంత్ మోటారు బైక్‌పై భార్య, కుమార్తెతో కలిసి విజయవాడ వైపు నుంచి మంగళగిరి వైపు వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. తాడేపల్లికి చెందిన వీరి మృతి సమాచారం తెలుకున్న బంధువులు ఘటనా స్థలికి చేరుకుని రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కోపోద్రిక్తులై ఇసుక లారీ డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించగా పోలీసులు వారించారు. కొద్దిసేపు ధర్నా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అటుగా వెళ్లే ఇసుక లారీలను సైతం ఆపి నిత్యం వేగంగా నడిపి ప్రాణాలు తీస్తున్నారంటూ డ్రైవర్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీల వేగాన్ని నియంత్రించక పోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తపర్చారు.
డీఎస్పీ రామాంజనేయులు అక్కడికి చేరుకుని లారీల వేగాన్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.