క్రైమ్/లీగల్

కారు బోల్తా : పలువురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాప్తాడు, మే 21 : మండల కేంద్రంలోని స్థానిక 44వ జాతీయ రహదారిపై లింగనపల్లి క్రాస్ వద్ద కారు బోల్తాపడడంతో ఆరు మంది గాయపడ్డారు. రాప్తాడు ఎస్‌ఐ ధరనిబాబు తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్‌కు చెందిన 6 మంది మిత్రులు కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా రాప్తాడు సమీపంలోకి రాగానే కారుకుముందు టైరు పగలడంతో రోడ్డు పక్కన కారు బోల్తా పడింది. కారు లోపల బెలూన్‌లో ఓపన్ కావడంతో అందరికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఇంటికి నిప్పంటించిన దుండగులు
లేపాక్షి, మే 21: మండలంలోని నాగేపల్లిలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఇంట్లో వస్తువులను దొంగలించడంతోపాటు నిప్పంటించి పరారయ్యారు. బాధితురాలు పద్మావతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాను తన భర్త మల్లేష్‌తో కలిసి వారం క్రితం బంధువుల ఊరికి వెళ్లామన్నారు. ఆ ఇంటిపై నిఘా ఉంచిన గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి ఇంట్లో ఉన్న టీవీ, బీరువాను పగులగొట్టడంతోపాటు కొన్ని పత్రాలు దోచుకెళ్లారన్నారు. దీనికి తోడు ఇంట్లోని పరుపులు, బట్టలకు నిప్పంటించి పరారైనట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పుట్లూరు, మే 21 : ఎ.కొండాపురం, యర్రగుంటపల్లి గ్రామాలకు మధ్యలో వున్న కంకరమిషన్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న మహారాష్టక్రు చెందిన సునీల్‌ధనరాజ్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. తన స్నేహితులతో కలిసి కొండాపురం నుండి కాలినడక వస్తున్న సమయంలో కొండాపురం నుండి తాడిపత్రి వైపుకు వెళ్తున్న చిలమకూరు నాగశేషుకు చెందిన ద్విచక్రవాహనంతో ఢీ కొనడంతో సునీల్‌ధనరాజ్‌కు గాయాలు అయ్యాయి. గాయాలపాలైన అతడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ రామక్రిష్ణ తెలిపారు.