క్రైమ్/లీగల్

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏన్కూరు, మే 21: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల మరిధిలోని భగవన్‌నాయక్‌తండాలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన గుగ్గులోత్ రమేష్ (33) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్‌కు మణుగూరుకు చెందిన అనూషతో గత సంవత్సరం వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో 20 రోజుల క్రితం భార్య భర్తల మధ్య గొడవ జరిగి రమేష్ భార్య అనూష తన తల్లిగారింటికి మణుగూరు వెళ్లింది. దీంతో రమేష్ ఈనెల 19న భార్యను తీసుకొని రావటానికి మణుగూరు వెళ్లాడు. అత్తగారి ఇంటి వద్ద 20న పెండ్లిరోజు జరుపుకొని తిరిగి 21న సోమవారం ఒక్కడే తన ఇంటికి భగవన్‌నాయక్ తండా చేరుకున్నాడు. ఇంటికి రాగానే నోట్‌పుస్తకంలో లెటర్‌రాసి పెట్టి ఏన్కూరు వెళ్లి పురుగుల మందు కొనుక్కొని ఏన్కూరు సమీపంలోని పామాయిల్ తోటలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పక్కనే పని చేస్తున్న కూలీలు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు, సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని చూసి భోరున విలపించారు. ఇదిలా ఉండగా మృతుడు రమేష్ ఇంటి వద్ద రాసిన లెటర్‌లో తన చావుకు కారణం భార్య అనూష, అత్త విజయ అని రాసి ఉంది. ఈలెటర్ తీసుకొని వచ్చి మృతుని తల్లి బాణి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి పంచనామ నిర్వహించారు. మృతుని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.