క్రైమ్/లీగల్

ట్రాక్టర్ కింద పడి ఇంటర్ విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల టౌన్, మే 21: ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత విద్యనభ్యసించి చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించసాగారు. ఈ సంఘటన మండలంలోని వాడరేవు-రామాపురం రోడ్డులోని ఓ అతిథి గృహం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెంకు చెందిన కాటంగారి నాగరాజు(19) అతని స్నేహితుడు సురేష్‌లు ద్విచక్రవాహనంపై వాడరేవు లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. తిరిగి పొట్టి సుబ్బయ్యపాలెం వెలుతుండగా వాడరేవు-రామాపురం రోడ్డులోని ఓ ప్రయివేటు అతిథి గృహం సమీపంలో రామాపురానికి మంచినీటితో వెలుతున్న కీర్తిపాలెంకు చెందిన ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసి, విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి ట్రాక్టర్ కింద పడ్డారు. ఈ సంఘటనలో నాగరాజు ట్రాక్టర్ చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు స్నేహితుడు సురేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మృతుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పొట్టి సుబ్యయ్యపాలెంకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో చేరుకుని కన్నీరు, మున్నీరయ్యారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, టూటౌన్ సీఐ రామారావు, ఈపూరుపాలెం ఎస్సై అనూక్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల వైద్యశాలకు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నాగరాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనూక్ తెలిపారు.