క్రైమ్/లీగల్

చికిత్స పొందుతూ కౌలు రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, మే 22:పగిడ్యాల మండల పరిధిలోని సంకిరేణిపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు నాగిరెడ్డి(30) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ముచ్చుమర్రి ఎస్‌ఐ కిరణ్‌బాబు తెలిపిన వివారాలు.. గ్రామానికి చెందిన నాగిరెడ్డి ఐదెకరాల సొంత పొలంతో పాటు ముంపునకు గురైన మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగుచేశారు. మినుము, శెనగ పంటల సాగు కోసం దాదాపు రూ. 30 లక్షలకు పైనే అప్పులు చేశాడని, సాగు చేసిన పంటలకు మద్దతు ధర లేకపోవడంతో చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేకపోవడంతో ఈ నెల 20వ తేదీ క్రిమిసంహారక మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం నాగిరెడ్డిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. అతడి తండ్రి శివారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.