క్రైమ్/లీగల్

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల గల్లంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దిరాల, మే 25: వేసవి సెలవుల్లో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు గల్లంతైన సంఘటన నూతన్‌కల్ మండలంలోని తాళ్లసింగారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకొంది. గ్రామస్ధులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఈతకు వెళ్లిన తాళ్లసింగారం గ్రామానికి చెందిన జూలూరి రవి కుమారుడు తరుణ్ (8), గిలకత్తుల పరమేష్ కుమారుడు చింటు (9) సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా రామసముద్రం అనే బావి దగ్గర పిల్లల బట్టలు విప్పి వుండటంతో గ్రామస్ధులకు తెలపగా బావిలో గాలించే ప్రయత్నం చేశారు. బావిలో నీరు లోతుగా వుండటంతో వెతికేందుకు వీలుగాకపోవడంతో మోటార్లసాయంతో నీటిని బయటకు దోడుతున్నారు. బావి నుంచి నీరు వదిలే ప్రయత్నం ఇంకా కొనసాగుతున్నది. గల్లంతైంది ఇద్దరు చిన్నారులు కావడంతో తల్లిదండ్రులు, ఊరంతా శోకసంద్రంలో నిండిపోయింది.