క్రైమ్/లీగల్

హంతక ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 31: ఇళ్లలో ఒంటరిగా ఉన్న మహిళలను హత్యచేసి వారి వద్ద బంగారు నగలు దోచుకున్న ముగ్గురు సభ్యుల హంతక ముఠాను కడప జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 2013లో ఈ ముఠా కడప జిల్లా ప్రొద్దుటూరులో వరుసుగా ముగ్గురు మహిళలను హత్యచేసి నగలు దోచుకుంది. ముఠాసభ్యుల్లో అబ్దుల్ కలాం, షేక్ మహ్మద్ ఇషాక్, గౌస్ లాజమ్ ఉన్నారు. వీరు ముగ్గురూ కలిసి ప్రొద్దుటూరులో 2013లో నాలుగు నెలల వ్యవధిలో ముగ్గురు మహిళలను చంపి, శవాలను ఆనవాళ్లు లేకుండా చేసేవారు. బి.లక్ష్మీదేవి, ఎం.శారద, కె. సుబ్బరంగమ్మను చంపారు. మహిళలు ఒంటరిగా ఉన్నది గమనించి లోపలికి చొరబడి వారిని చంపి, ఒంటిపై ఉన్న నగలు దోచుకుని శవాలను సంచుల్లో కుక్కి దూరంగా తీసుకువెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. వరుస హత్యలను సీరియస్‌గా తీసుకుని చాకచక్యంగా వ్యవహరించి నిందితులు అబ్దుల్ కలాం, గౌస్ లాజమ్‌ను అరెస్టుచేసినట్లు ఎస్పీ అట్టాడ బాబూజీ తెలిపారు. మరో నిందితుడు షేక్ అహ్మద్ ఇసాక్ ఓ కేసులో ఇప్పటికే కడప జైలులో ఉన్నాడన్నారు. అబ్దుల్ కలాం గతంలో కడప నగరంలో ఓ మహిళను తన ఇద్దరు అనుచరులతో కలిసి ఇలాగే హత్యచేసినట్లు ఎస్పీ తెలిపారు.