క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకుటలపల్లి, జూన్ 1: మండల పరిధిలోని సులానగర్ గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన శుక్రవారం పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందాడు. టేకులపల్లి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తడికలపూడి పంచాయతీ కోక్యాతండాకు చెందిన భూక్యా పూల్‌సింగ్ (30) ద్విచక్రవాహనంపై కుటుంబ సభ్యులతో కలిసి టేకులపల్లి వైపు వెళుతుండగా భారీ వర్షంతో వస్తుండటంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకింద వాహనాన్ని నిలిపి అగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడటంతో పూల్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలనానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.